హోంఆంధ్రప్రదేశ్ ఒకే స్కూల్లో 19 మందికి పాజిటివ్Sep
అమరావతి (ఆంధ్రజ్యోతి), కోట, సెప్టెంబరు 3: నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడులోని యానాదుల గురుకుల కళాశాల, పాఠశాలలో శుక్రవారం ఒకేరోజు 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో వారిని వెంటనే గూడూరు కొవిడ్ సెంటర్కు తరలించారు. రెండు రోజుల క్రితమే ఈ గురుకులంలో ఏడుగురు విద్యార్థులతోపాటు ఓ టీచర్కి కరోనా సోకింది. తాజాగా 19 కేసులు నమోదవడంతో అధికారులు
గురుకులాన్ని సందర్శించారు. మిగతా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కూడా కరోనా పరీక్షలు చేయించారు. కాగా.. మనుబోలు మండలంలోని గొట్లపాళెం ప్రాథమికోన్నత పాఠశాలలోనూ ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
కొత్తగా 1,520 కేసులు.. 10 మరణాలు
రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 64,739 శాంపిల్స్ను పరీక్షించగా 1,520 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కరోనాతో మరో 10 మంది చనిపోయారని తెలిపింది
0 Response to "హోంఆంధ్రప్రదేశ్ ఒకే స్కూల్లో 19 మందికి పాజిటివ్Sep"
Post a Comment