సలహాదారు జీవీడీ వేతనం పెంపు
14 వేల నుంచి 2 లక్షలకు పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు..
అమరావతి, సెప్టెంబరు 3 రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్లు) జీవీడీ కృష్ణమోహన్ జీతాన్ని రూ.14 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఆయన జీతం ఇప్పుడు మంత్రులు, ఆ హోదా ఉన్న ఇతర సలహాదారుల కంటే ఎక్కువన్న మాట. సాధారణంగా మం త్రులు, కేబినెట్ ర్యాంకు ఉన్న వారందరికీ ఒకే జీతం నిర్ణయిస్తారు.
జీవీడీకి కూడా కేబినెట్ ర్యాంకు ఇవ్వడంతో ఆయన జీతం కూడా అంతే నిర్ణయించారు. ఆయన నియామకం సమయంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం
వైద్య ఖర్చులకు మంత్రులతో సమానంగా ఇస్తున్నారు. అయితే తాజాగా ఆయన పనితీరు బాగుందని పేర్కొంటూ జీతాన్ని రూ.14 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచారు
మరి ఉద్యోగుల వేతనాల పెంపు ఎప్పుడో అని ఉపాధ్యాయులు వాపోతున్నారు.పి.ఆర్.సి గడువు ముగిసి రెండేల్లయిన పట్టించుకొన్న పాపాన లేదు.
పి.ఆర్.సి కమిటి గడువు ఎప్పుడు ముగుస్తుందో వేచిచూడాల్సిందే.
0 Response to "సలహాదారు జీవీడీ వేతనం పెంపు"
Post a Comment