దేశ ప్రజలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ.

హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారినుంచి తప్పించుకునే క్రమంలో మాస్కు ప్రధాన అయుధం అని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మాస్కు ధరించడంపై కీలక మార్గదర్శకాలు వెల్లడించింది. సింగిల్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, 



వ్యాయామం చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు మాస్కు అవసరంలేదని స్పష్టం చేసింది. అయితే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది ఉన్నప్పుడు, జిమ్ లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం మాస్కు 



వేసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "దేశ ప్రజలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ."

Post a Comment