అక్టోబరు 5నాటికి 'జగనన్న విద్యా కానుక' వాయిదా
అక్టోబరు 5నాటికి 'జగనన్న విద్యా కానుక' వాయిదా
పాఠశాల విద్య సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు(ఐ.ఏ.ఎస్)గారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు (ఐ.ఎ.ఎస్) గారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు
. 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని సెప్టెంబరు5వ తేదీన ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే.
అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ - 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడం. వలన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేది నాటికి వాయిదా వేస్తున్నట్లు తాత్కాలికంగా. నిర్ణయించడమైనదని పేర్కొన్నారు.
“జగనన్న విద్యాకానుక' కార్యక్రమం అక్టోబరు 5వ తేదీన ఏర్పాటవుతుంది కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు గమనించాలని పాఠశాల విద్య సంచాలకులు వారు కోరారు.
0 Response to "అక్టోబరు 5నాటికి 'జగనన్న విద్యా కానుక' వాయిదా"
Post a Comment