ఉత్తమ గురువు. గురుదేవుళ్లందరికీ ముందుగానే గురుపూజోత్సవ శుభాకాంక్షలు

ఉత్తమ గురువు

విశాలపురాన్నేలే రామభద్రమహారాజు వృద్ధుడయ్యాడు. ఆయన రాజ్యభారాన్ని తన కుమారుడైన వీరభద్రుడికి అప్పగిస్తూ, ‘‘నాయనా! నేను రాజునయ్యేనాటికి, మన పౌరుల్లో అధిక శాతం విద్యావిహీనులు కావడంవల్ల మూఢ నమ్మకాలతో, మూఢాచారాలతో తాము ఇబ్బంది పడుతూ, సమాజానికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకని నేను రాజధానిలో ఒక విద్యాలయాన్ని నెలకొల్పాను. కానీ సరైన గురువు లేక ఆ విద్యాలయం, నేనాశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేక పోయింది. ముందుగా నీవు, ఆ విద్యాల…యానికి సరైన గురువును ని…యమించు,'' అని చెప్పాడు.


తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వీరభద్రుడు వెంటనే మంత్రులతో ఆ విష…యం గురించి సమాలోచన జరిపాడు.
మంత్రులందరూ ముఖముఖాలు చూసుకుంటూంటే, వారిలో వృద్ధుడూ, వివేకవంతుడూ అయిన వాచస్పతి విన…యంగా, ‘‘రాజా! విద్యపట్ల ఆసక్తివున్నవారికి తల్లిదండ్రులు, చుట్టూవున్న ప్రకృతి అంతా గురువులే. అలాంటి వారిని ఒక సక్రమ పద్ధతిలో మరింత ప్రభావితం చేసేందుకు, మీ తండ్రిగారు రాజధానిలో విద్యాల…యాన్ని స్థాపించారు. అక్కడ శిక్షణ పొందినవారు దేశమంతటా వ్యాపించి, మన పౌరులందరిలోనూ విద్యపట్ల ఆసక్తిని పెంచుతారని ఆయన ఆశించారు. కానీ, మనం నియమించిన గురువులు అనుకున్నది సాధించలేకపోయారు,'' అంటూ పరిస్థితిని వివరించాడు.
‘‘అందుకు కారణమేమిటి?'' అన్నాడు వీరభద్రుడు. ‘‘పాండిత్యమున్నవారు గొప్ప పండితులుగా మాత్రమే చలామణీ కాగలరు. వారందరూ గొప్ప గురువులు కాలేరు. మనం గొప్ప పండితులను విద్యాలయానికి గురువులుగా ని…యమించాం. వారు గొప్ప గురువులు కాలేక పోయారు.

అయినా, గురువుల గొప్పతనాన్ని కూడా పరీక్షంచవలసివుంటుందని, ఇప్పుడిప్పుడే నాకూ స్ఫురిస్తున్నది,'' అన్నాడు వాచస్పతి. ఈ మాటలు వీరభద్రుడికి వాస్తవం అనిపించాయి. అతడు చారులను పంపి విచారించగా, దండకారణ్యంలో ప్రశాంతుడు, ప్రసేనుడు అనే ఇద్దరు ఉద్దండ పండితులున్నారనీ, వారి శిక్షణలో ఎందరో ఆరితేరిన విద్యావంతులు తయారయ్యారనీ తెలిసింది.
వీరభద్రుడు, వాచస్పతికి ఈ విషయం చెప్పి, వారిద్దరిలో ఒకరిని వెంటనే రాజధానిలోని విద్యాలయానికి ఆహ్వానించవలసిందిగా కోరాడు. వాచస్పతి కాసేపాలోచించి, ‘‘రాజా! మన విద్యాల…యంలో చేరి విద్యావంతులు కాలేకపోయిన ఇరవైమంది…యువకులను ఎన్నుకుని, వారిలో పదిమందిని ప్రశాంతుడికీ, మరొక పదిమందిని ప్రసేనుడికీ అప్పగిద్దాం.
 
ఆరుమాసాల గడువులో ఎవరు సత్ఫలితాలు సాధిస్తే, వారిని మన విద్యాల…యంలో గురువుగా ని…యమిద్దాం!'' అని సూచించాడు. రాజు వీరభద్రుడు ఇందుకు సంతోషంగా సరేనన్నాడు.
 
అనుకున్న ప్రకారం వాచస్పతి పదిమందిని ప్రశాంతుడి వద్దకూ, మరొక పదిమంది విద్యార్థులను ప్రసేనుడి వద్దకూ పంపాడు. ఆరుమాసాలు గడిచే సరికి ప్రశాంతుడి వద్ద చేరినవారిలో ముగ్గురు శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించితే, ప్రసేనుడి వద్ద చేరినవారిలో ఏడుగురు నైపుణ్యం సంపాయించారు. అప్పుడు వాచస్పతి ముందుగా ప్రసేనుణ్ణి, ‘‘మరి మిగతాముగ్గురి మాట ఏమిటి?'' అని అడిగాడు.
 
‘‘నాదగ్గర మిగిలిన ఆ ముగ్గురూ జడులు, జన్మతః మందమతులు! వాళ్ళను ఎవరూ విద్యావంతుల్ని చే…యలేరు,'' అన్నాడు ప్రసేనుడు.
 
ఆతర్వాత వాచస్పతి, ప్రశాంతుణ్ణి కలుసుకుని, ‘‘మీవద్ద మిగిలిన ఆ ఏడుగురు విద్యార్థుల మాటేమిటి?'' అని అడిగాడు.
 
దానికి ప్రశాంతుడు, ‘‘మంత్రివర్యా! నావద్ద చేరిన విద్యార్థుల్లో ముగ్గురు చురుకైనవారు. అందువల్ల త్వరత్వరగా వారికి విద్యాగంధం సోకింది. విగిలిన ఏడుగురూ అంత చురుకుకాదు. ఆరు మాసాల్లో వారిని విద్యావంతుల్ని చేయగల సమర్థత నాకు లేదు. మరికొంత గడువిస్తే, వారినీ ఆ ముగ్గురు విద్యార్థుల స్థాయికి తీసుకురాగలను,'' అన్నాడు.

వాచస్పతి, రాజుకు ఈ విష…యం చెప్పి, రాజధానిలోని విద్యాల…యానికి ప్రశాంతుణ్ణి గురువుగా ని…యమించమని సలహాయిచ్చాడు.
 
ఇందుకు రాజు ఆశ్చర్యపోయి, ‘‘గురువర్యా! ఆరు మాసాలలో ఏడుగురిని విద్యావంతుల్ని చేసిన ప్రసేనుణ్ణి కాదని, ముగ్గుర్ని మాత్రమే విద్యావంతుల్ని చే…యగలిగిన ప్రశాంతుడికి పదవి ఇవ్వడం విజ్ఞత అవుతుందా?'' అని అడిగాడు.
 
అందుకు వాచస్పతి చిరునవ్వు నవ్వి, ‘‘రాజా! మన విద్యాలయంలో ఎందుకూ కొరగాని వారనుకున్నవారిని ప్రశాంతుడూ, ప్రసేనుడూ కూడా విద్యావంతుల్ని చేయగలిగారు. అంటే, నిస్సందేహంగా ఇద్దరికిద్దరూ గొప్ప గురువులు. ప్రసేనుడు ఏడుగురినీ, ప్రశాంతుడు ముగ్గుర్నీ విద్యావంతులుగా చేయగలిగారంటే - అది వారి ప్రతిభకు కొలబద్దగా తీసుకోకూడదు! ప్రసేనుడి వద్ద చురుకైనవారు ఎక్కువమంది చేరినట్లు భావించాలి. ఎందుకంటే, చురుకుతనం లేనివారి నా…యన, జడులు అంటూ ఈసడించాడు. ఇకపోతే, ప్రశాంతుడు తన శిష్యులెవరినీ జడులు అనుకోలేదు. ఇక్కడ మనం విష్ణుశర్మా, మూర్ఖులైన ముగ్గురు రాజకుమారుల కథా జ్ఞప్తికి తెచ్చుకోవలసిన అవసరం వుంటుంది!'' అంటూ ఆగాడు.
 
రాజు, ‘‘అవునవును!'' అంటూ తల ఊపి, ‘‘చెప్పండి, గురువర్యా!'' అన్నాడు.
 
‘‘రాజా! మనం ఒకటి గమనించాలి. ప్రశాంతుడు మిగిలిన ఏడుగురు శిష్యులనూ విద్యావంతులను చే…యడానికి మరికొంత వ్యవధి కావాలన్నాడే తప్ప శిష్యుల నా…యన తప్పుపట్ట లేదు. శిష్యులను జడులనుకునే వాడు ఉత్తమ గురువు కానేరడు. అందువల్ల, నేను ప్రశాంతుణ్ణి ఉత్తమ గురువుగా ఎన్నికచేశాను,'' అన్నాడు వాచస్పతి.
 
రాజు వీరభద్రుడు, వాచస్పతిని మెచ్చుకుని, ప్రశాంతుణ్ణి రాజధానివిద్యాల…యంలో గురువుగా ని…యమించాడు. అతడి శిక్షణలో ఎందరో …యువకులు విద్యావంతులై విశాలపురంలో విద్యావ్యాప్తికి తోడ్పడి, దేశ పౌరుల మానసిక వికాసానికి సా…యపడ్డారు.


రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం.  సమాజాన్ని జాగృతంచేసి , విద్యార్ఢులలో నిభిడీకృతమైన శక్తులను వెలికితీసీ సంపూర్ణ వ్యక్తిత్వంకల భావిభారత పౌరులను తీర్చిదిద్దుతు ,ఉన్నత మానవతా  విలువలు కలిగిన పౌరసమాజాన్ని తీర్చి దిద్దుతున్న గురుదేవుళ్లందరికీ  ముందుగానే గురుపూజోత్సవ   శుభాకాంక్షలు. కోవిడ్ 19 వల్ల ఈ సంవత్సరం సోషల్ మీడియా ద్వారానే శుభాకాంక్షలు చెప్పుకోవలసిన పరిస్ధితి ఉంది.

సమాజంలో ఉన్నతంగా తీర్చి దిద్దబడిన ఒక వ్యక్తి నా ఈ స్థాయికి మా గురువుగారు కారణం అని చెప్పగలిగేలా చేసిన గురువు సమాజానికి దేవుడుతో సమానం. ఈ గౌరవంముందు  ఏ అవార్డయినా చిన్నదే అవుతుంది. అటువంటి అత్యుత్తమమైన సమాజ అభిమానం ప్రతీ ఉపాధ్యాయుడు పొందాలని ఆకాంక్షిస్తూ నా ఉపాధ్యాయ సోదర సోదరీమణు లెల్లరకూ  ఉపాధ్యాయ  దినోత్సవ శుభాకాంక్షలు. 

మనదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన  ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day)   జరుపు కుంటాము.

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు.  

 *విద్యార్ధి ...సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ.* 
అదృష్టవశాత్తూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా "టీచర్స్ డే" గా  జరుపుకుంటున్నాము.
 సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కావడమే.  1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందిం చడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది.

 ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు.

 "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడి పోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. 

ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం.

 ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా  గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.

ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం అతడు ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అంతే కాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ ...ఇలా సంఘంలో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.

విద్యార్ధి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తై పోయిందనుకోకూడదు. విద్యాలయంనుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటివరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యంత జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి మరణంవరకూ ఉపాధ్యాయుడుగానే ఉండడం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టతను తెలియజేస్తుంది. 

ఇటీవల రష్యా అధ్యక్షుడు కోవిడ్ వేక్సిన్ విడుదలచేస్తూ ముందుగా వేక్సిన్ ఉపాధ్యాయులకు వైద్యులకు మాత్రమే ఇవ్వబడుతుందని ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని మనం ఊహించలేమని చెప్పడం - సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి తెలియచేస్తుంది.

ప్రపంచంలో "సార్" అని ప్రతిఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం "సార్" అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే.

సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంచనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి.

 ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనిపించుకున్న వృత్తి నేడు నేడు బ్రతుకు కొరకు బడి పంతులు అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన ,నిర్వహిస్తున్న పాత్ర అని సగర్వంగా చెప్పవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉత్తమ గురువు. గురుదేవుళ్లందరికీ ముందుగానే గురుపూజోత్సవ శుభాకాంక్షలు"

Post a Comment