ఇక క్యాలెండర్లు, డైరీలు ‘డిజిటల్‌’ రూపంలోనే

 ఇక క్యాలెండర్లు, డైరీలు ‘డిజిటల్‌’ రూపంలోనే..

ముద్రణ వద్దంటూ ప్రభుత్వ శాఖలకు కేంద్రం ఆదేశాలు



దిల్లీ: మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు ఇక ఏవిధమైన క్యాలెండర్లు, డైరీలు, పండగల గ్రీటింగ్‌ కార్డులు వంటి వాటిని ముద్రించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 



‘ఆర్థిక సూచనలు.. ప్రింటింగ్‌ కార్యకలాపాలు’ పేరిట కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని వ్యయ విభాగం ఈమేరకు మెమొరాండం జారీ చేసింది. కాఫీ-టేబుల్‌ బుక్స్‌ ముద్రణను కూడా నిషేధించింది. వీటన్నింటినీ ఇక డిజిటల్‌, ఆన్‌లైన్‌ విధానంలోనే రూపొందించాలని స్పష్టం చేసింది. 



అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలు డిజిటల్‌, ఆన్‌లైన్‌ విధానాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక క్యాలెండర్లు, డైరీలు ‘డిజిటల్‌’ రూపంలోనే"

Post a Comment