12 నుంచి హాల్ టికెట్లు
సచివాలయ పరీక్షలకు సిద్ధం
16,208 పోస్టుల కోసం 10,63,168 మంది దరఖాస్తు
20వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు పరీక్షల నిర్వహణ
పరీక్ష కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ పూర్తి
ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల
రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్
షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్
నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు
వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ..
పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున
సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి
0 Response to "12 నుంచి హాల్ టికెట్లు"
Post a Comment