సప్తగిరి ఛానెల్లో పాఠ్యాంశాలు ప్రసారం
1–10వ తరగతి విద్యార్థులకు బోధన
నేటి నుంచి తరగతులు ప్రారంభం
లాక్డౌన్ సమయంలో, ఆ తరువాత కూడా విద్యాశాఖ టెన్త్ విద్యార్థులకు
పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సన్నద్ధతకు వీలుగా పాఠాలను దూరదర్శన్ ద్వారా
రోజూ 2 గంటలపాటు ప్రసారం చేయించింది.
► తరువాత ఇతర తరగతుల విద్యార్థులకు బ్రిడ్జికోర్సు, విద్యావారథి పేరిట పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారాలను కొనసాగించింది. ► అన్లాక్ 4లో సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధించాలని కేంద్రప్రభుత్వం సూచించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేశారు.
► ఈ మేరకు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్ (సీమ్యాట్) డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య మెమో జారీచేశారు.
► సెప్టెంబర్ 10 వరకు రోజువారీగా ఆయా తరగతులకు బోధన జరిగే అంశాల షెడ్యూల్ను ప్రకటించారు. వారంలో అయిదు రోజుల పాటు ఈ ప్రసారాలు ఉంటాయి. ప్రతి రోజూ ఆరుగంటలపాటు ప్రసారం చేస్తారు
0 Response to "సప్తగిరి ఛానెల్లో పాఠ్యాంశాలు ప్రసారం"
Post a Comment