బడులు ఇప్పుడే తెరవద్దు

న్యూఢిల్లీ/అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబరు 5నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. 



ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందన్నారు. 



ఇలాంటి విపత్కర సమయంలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలు బడికి వెళ్లడం వల్ల వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "బడులు ఇప్పుడే తెరవద్దు"