పెన్షన్‌ స్కీమ్‌లో మార్పుల్లేవు



హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. కాంట్రిబ్యూటరీ పెన ్షన్‌ స్కీమ్‌(సీపీఎ్‌స)ను యథాతథంగా వర్తింపజేస్తామని, పెన్షన్‌ స్కీమ్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని సర్కారు స్పష్టం చేసింది.



 ఈ మేరకు నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటెడ్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎ్‌సడీఎల్‌)లో ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్‌ నిధిని జమ చేసుకోవడానికి వీలుగా ఒప్పందం చేసుకోవడానికి ట్రెజరీ డైరెక్టర్‌ (డీటీఏ) అధికారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ ఆదివారం జీవోనెం.28ను జారీ చేశారు. దీని ప్రకారం సీపీఎస్‌ కింద ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌తో అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు

దాంతో సదరు పెన్షన్‌ స్కీమ్‌తో ముడిపడిన అన్ని అంశాలనూ నెరపడానికి డీటీఏకు అధికారం కల్పించి.. ఆయననను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో కొత్త రాష్ట్రంగా ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(పీఎ్‌ఫఆర్‌డీఏ)తో తాజాగా ఒప్పందం చేసుకోవాలని ఆ సంస్థ చైైర్మన్‌ తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవలే లేఖ రాశారు. దాంతో ఉమ్మడి రాష్ట్రం ఏపీలో సీపీఎ్‌సను అమలు చేసినట్లుగానే తెలంగాణలో కూడా అమలు చేయనున్నామని, స్కీమ్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా ఉత్తర్వులతో సీపీఎస్‌ అమలవుతున్న 1.30 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సీపీఎస్‌ పథకాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు మధ్యలో విడుదలైనప్పటికీ ఆ పరిస్థితి లేదని తాజా జీవోతో స్పష్టమయింది. ఒప్పందం అనంతరం తెలంగాణలో సీపీఎస్‌ అమలుపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పెన్షన్‌ స్కీమ్‌లో మార్పుల్లేవు"

Post a Comment