ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన మోదీ సర్కార్....?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది కరోనా, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు మారిన నేపథ్యంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వీళ్లకు కేంద్రం ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని కీలక ప్రకటన చేసింది. రెగ్యులర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేసేంత వరకు కేంద్రం ఈ విధంగా పెన్షన్ అందించనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
దేశంలో వైరస్ శరవేగంగా విజృంభిస్తోందని.... కరోనా, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.... హెడ్ ఆఫీస్లో పెన్షన్ ఫామ్స్ను సమర్పించడంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని
పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ డిపార్ట్మెంట్ కేంద్రంలో మోదీ సర్కార్ అమలులోకి వచ్చిన రోజు నుంచి అప్ గ్రేడ్ అయిందని... డిజిటలైజేషన్లో భాగంగా ప్రత్యేక పోర్టల్ ను కుడా ఆవిష్కరించామని.... ఉద్యోగులు పదవీ విరమణ చేసే రోజునే వారికి వారికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ను అందజేస్తున్నామని... పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవాళ్లు వెబ్సైట్కు వెళ్లి పెన్షన్ పేపర్ల స్టేటస్ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
అయితే కరోనా వైరస్ విజృంభణ వల్ల ఆఫీస్ వర్క్ ఆగిపోయిందని.... అందువల్ల ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వాళ్లకు పీపీవో ఆర్డర్లు అందలేదని చెప్పారు. వీళ్లకు పెన్షన్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ప్రొవిజనల్ పెన్షన్ అందించేందుకు సిద్ధమయ్యామని అన్నారు. పదవీ విరమణ చేసిన దగ్గరి నుంచి 6 నెలలు లేదా ఏడాది పాటు ప్రొవిజనల్ పెన్షన్ ను అందిస్తామని తెలిపారు
0 Response to "ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన మోదీ సర్కార్....?"
Post a Comment