పిల్లలు తట్టుకోగలరు.. ఎయిమ్స్ ప్రొఫెసర్ల అంచనా
న్యూఢిల్లీ, జూలై 20:
పాఠశాలలు, కళాశాలలు తెరవడం ద్వారా కరోనాకు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్
ఇమ్యూనిటీ) సాధించ్చవచ్చని ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రొఫెసర్లు కొందరు అభిప్రాయపడ్డారు. కేసుల
సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే కాకుండా, కేసుల పెరుగుదల
వేగం నిలకడగా ఉన్న దశలో స్కూళ్లు, కాలేజీలు తెరవాలని, అప్పుడు హెర్డ్
ఇమ్యూనిటీ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
ఏదైనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు దాని బారి నుంచి కాపాడేవి రెండే. ఒకటి
.. ఆ వైర్సను కట్టడి చేసే వ్యాక్సిన్
రెండోది హెర్డ్ ఇమ్యూనిటీ. సమూహ రోగనిరోధక శక్తిని రెండు రకాలుగా
సాధించవచ్చు. ఒకటి.. జనాభాలో 70ు మంది ఆ వైర స్కు ఎక్స్పోజ్ కావడం
ద్వారా. రెండు వ్యాక్సిన్ ద్వారా. కరోనాను నిరోధించే వ్యాక్సిన్ కోసం
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణులు
తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. కొంతమేరకు పురోగతి సాధించారు కూడా. కానీ,
సమర్థమైన వ్యాక్సిన్ నిజంగా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి
ఎక్కువ మంది వైర్సకు ఇన్ఫెక్ట్ అవడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని
సాధించడమే మనముందున్న మార్గమని ఎయిమ్స్లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ
ప్రొఫెసర్ సంజయ్ కె.రాయ్ పేర్కొన్నారు. వైరస్ భయంతో మూసేసిన స్కూళ్లు,
కాలేజీలను కనుక.. శానిటైజేషన్, భౌతిక దూరం వంటి నిబంధనలన్నీ పాటిస్తూనే
మళ్లీ తెరిస్తే అందరూ వైర్సకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని
ఆయన వివరించారు. పిల్లల రోగనిరోధక శక్తి తాజాగా ఉంటుంది కనుక వారు దాన్ని
సమర్థంగా ఎదుర్కొని, హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడంలో కీ లకంగా పనిచేస్తారని
డాక్టర్ రాయ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ కొద్దిగా కష్టమైనప్పటికీ..
జాగ్రత్తగా అమలు చేస్తూ, పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకుంటే ఇది
విజయవంతమవుతుందని పేర్కొన్నారు. ఇక.. కొవిడ్-19 సంక్షోభాన్ని లాక్డౌన్
ఆంక్షలు పరిష్కరించలేవని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం మాజీ
అధిపతి డాక్టర్ చంద్రకాంత్ ఎస్ పాండవ్ అన్నారు. సమూహ రోగనిరోధక శక్తిని
సాధించడమే ఈ సమస్యకున్న ఏకైక పరిష్కారమని ఆయన తేల్చిచెప్పారు
0 Response to "స్కూళ్లు, కాలేజీలు తెరిస్తే హెర్డ్ ఇమ్యూనిటీ"
Post a Comment