ప్రభుత్వోద్యోగులకు వంతులవారీ పని

ప్రభుత్వోద్యోగులకు వంతులవారీ పని

ఈనాడు, అమరావతి: కరోనా ఉద్ధృతి నేప
థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు
కుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వంతులవారీ పని
విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాల
యాలు మొదలు క్షేత్రస్థాయి వరకు సోమవారం
నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. దీని
ప్రకారం ఉన్నతాధికారులు మినహా... మిగతా
ఉద్యోగులందర్నీ రెండు బృందాలుగా విభజించ

నుంది. ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తే, రెండో బృందం తర్వాత వారం విధులకు వస్తుంది. కార్యాలయానికి రాని గ్రూపు ఇంటి నుంచి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శవల్నీ నియంత్రించాలని, అత్యవసర పని ఉంటే తప్పు అనుమతించరాదనీ నిబంధన విధించనున్నారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటించ డమే మార్గమని గుర్తించడంతో అందుకు తగ్గ ట్లుగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. జె రాష్ట్ర సచివాలయంలో విభాగాధిపతి (సెక్షన్‌ ఆఫీసర్‌) కంటే పై స్థాయి అధికారులు మాత్రం రోజూ విధులకు హాజరవుతారు. వీరందరికీ ప్రత్యేకంగా ఛాంబర్లు ఉంటాయి. కాబట్టి వంతులవారీ పని విధానం వర్తింపజే యడం లేదని సమాచారం. జ విభాగాధిపతి కంటే కింది స్థాయి ఉద్యోగుల్ని రెండు బృందాలుగా విభజిస్తారు. వీరిలో ఒక్కోబ్బందం ఒక్కోవారం విధులకు వస్తుంది. జ సచివాలయ ఉద్యోగులు అందరూ ఒకేసారి విధులకు హాజరవకుండా వేర్వేరు సమయాల్లో వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక వారంలో విధులకు హాజరయ్యే ఉద్యోగుల్ని మళ్లీ మూడు బృందాలుగా విభజిస్తారు. ఒక బృందం ఉదయం $.90కి, రెండో బృందం 10కి మూడో బృందం 10.8 గంటలకు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఇ ఈ పనివేళలను విభాగాధిపతులు తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోవచ్చు. కావాల నుకుంటే ఒక్కో బృందం రావడానికి మధ్య గంట వ్యవధినీ పాటించవచ్చు. ఇ ఏ సెక్టన్‌లోనూ ఎక్కువ రద్దీ లేకుండా, ఉద్యోగుల మధ్య తగినంత దూరం పాటిం చేలా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఇ జిల్లా స్థాయి కార్యాలయాల్లో గెజిటెడ్‌ అధికా రులు, అంతకు పైస్థాయి అధికారులు రోజూ విధులకు రావాలి. కింద స్థాయి ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని వర్తింపజేస్తారు. జ డివిజన్‌, మండల, గ్రామ స్టాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అక్కడి పరిస్థితుల్ని బట్టి ఉద్యోగులకు వంతులవారీగా విధులు కేటా యిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వోద్యోగులకు వంతులవారీ పని"

Post a Comment