ఎస్సీ, ఎస్టీలకు ఒక సర్వీసుకే ఉచిత0 విద్యుత్‌

ఎస్సీ, ఎస్టీలకు ఒక సర్వీసుకే ఉచిత0 విద్యుత్‌

దుర్వినియోగం అరికట్టడానికే:


 ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ తిరుపతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్‌ వినియోగ దారులకు ఉచిత విద్యుత్‌ సరఫరా పథకం అమలులో నూతన నిబంధన అమలు కానుంది. ఒక ఆధార్‌కార్డుతో ఒక విద్యుత్‌ సర్వీసు మాత్రమే లింక్‌ చేయాలని డిస్కం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీల విద్యుత్‌ సర్వీసులన్నింటినీ పరిశీలించనుంది.


ఆడిట్‌ పరిశీలన సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఒక ఆధార్‌కార్డుతో ఒకటికి మించి విద్యుత్‌ సర్వీ సులు పొంది ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జగన్‌ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీ గహ విద్యుత్‌ వినియోగదారులకు సంబంధించి నెలకు


 200 యూనిట్లలోపు వాడకం ఉన్నవారికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసేలా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ పథకం కింద ఒకే ఆధార్‌పై ఒకటికిమించి విద్యుత్‌ సర్వీసులు పొందినట్లు తేలిందని డిస్కం అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల ఈ పథకం దుర్వినియోగమ వుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్వినియోగాన్ని అడ్డుకోవ డానికి


 లబ్ధిదారుల వారీగా పరిశీలన జరపాలని, ఒక ఆధార్‌కార్డుపై ఒక సర్వీసు మాత్రమే లింక్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈలకు ఏపీఎ స్పీడిసీఎల్‌ సీఎండీ హరనాథరావు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఐటీ విభాగం జీఎంకు సైతం సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో దానికనుగుణంగా మార్పులు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమమంతా ఈ నెలాఖరులోగా ముగించాలని స్పష్టం చేశారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎస్సీ, ఎస్టీలకు ఒక సర్వీసుకే ఉచిత0 విద్యుత్‌"

Post a Comment