ఏపీ ఓటర్లు.. 4,00,02,782


  • 2.02 కోట్లతో మహిళలే అధికం
  • పురుషులు 1.97కోట్లకే పరిమితం 

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 5లక్షల మంది మహిళలు మగవారి కంటే అధికంగా



ఓటర్లుగా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక సమగ్ర సవరణ- 2020(స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌, ఎస్‌ఎ్‌సఆర్‌) ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం  విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్‌ ఓటర్ల తొలగింపు తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ ఈ తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. దీనిప్రకారం రాష్ట్రంలో 4,00,02,782 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితా(డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌-23.12.2019)లో 3,98,34,776మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 1,63,030 ఓట్లు నమోదు కాగా, ఓటర్ల పరిశీలన కార్యక్రమం తర్వాత వలస వెళ్లడం, స్థానికంగా లేకపోవడం లాంటి వివిధ కారణాలతో 60,412ఓట్లు తొలగించారు. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో పురుష ఓటర్లు 1,96,81,827మంది నమోదు కాగా 2020 ఎస్‌ఎ్‌సఆర్‌లో 1,97,90,730మంది నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,01,48,913 మంది మహిళా ఓటర్లు నమోదవగా ఇప్పుడు వారిసంఖ్య 2,02,07,984కు పెరిగింది. డ్రాఫ్ట్‌ జాబితాలో 4,036మంది థర్జ్‌ జండర్‌ ఓటర్లు ఉం డగా, ఇప్పుడు 4,068మంది నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 7,436మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, 65,388మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో 45,920 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్యను ఇప్పుడు 45,836కు తగ్గించారు. 


జిల్లాల వారీగా ఓటర్లు

శ్రీకాకుళం -  22,45,874

విజయనగరం - 18,61,812

విశాఖపట్నం - 36,12,431

తూర్పుగోదావరి - 42,54,300

పశ్చిమగోదావరి - 32,49,865

కృష్ణా -     35,85,928

గుంటూరు -     40,24,514

ప్రకాశం - 26,59,344

నెల్లూరు - 24,31,967

కడప - 22,55,309

కర్నూలు - 32,84,867

అనంతపురం - 33,03,599

చిత్తూరు - 32,32,972

మొత్తం  -        4,00,02,782

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ఓటర్లు.. 4,00,02,782"

Post a Comment