ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కెట్లు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కెట్లు

స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్‌,
టెక్ట్స్‌ బుక్స్‌, 8 జతల యూనిఫారాలు,
జత షూస్‌, సాక్సులు అందించనున్న
ప్రభుత్వం

సాక్షి అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే
విద్యార్థులకు స్కూలు బ్యాగు, నోట్‌ బుక్స్‌, టెక్‌
బుక్స్‌, 38 జతల యూనిఫారాలు, జత బూట్లు,
సాక్సులతో కూడిన కిట్లు అందించాలని రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసం
వత్సరం నుంచి వీటిని సమకూరుస్తారు. గతంలో
ప్రకటించిన దానికంటే అదనంగా స్కూలు
బ్యాగు, నోట్‌ బుక్స్‌ కిట్‌లో చేర్చారు. యూని
ఫారాల కుట్టుకూలీ, జత షూస్‌, సాక్సుల కొను
గోలు కోసం డబ్బులు ఇవ్వనున్నారు. మిగిలిన
వాటిని కిట్ల రూపంలో అందిస్తారు. పాఠశాల
విద్య, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం వైఎస్‌
జగన్‌ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష
నిర్వహించారు. పాఠశాలలు ప్రారంభించేనాటికి
వీటిని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.

విద్యార్థులకు తొలుత బ్రిడ్జి కోర్సులు

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి
నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం
ప్రవేశపెడుతున్న _ నేపథ్యంలో అందుకు
అనుగుణంగా నూతన పాఠ్యప్రణాళిక రూపకల్ప
నపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో చర్చిం
చారు. ఆంగ్ల మాధ్యమంలోకి పిల్లలను సన్నద్ధం

చేసేందుకు తొలుత బ్రిడ్జి కోర్సులను నిర్వహి
స్తామని అధికారులు వివరించారు. విద్యా సంవ
త్సరం ప్రారంభమైన మొదటి నెల రోజుల పాటు
విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు చేపట్టాలని అధి
కారులు ప్రతిపాదించగా పకడ్పందీగా అమలు
చేయాలని సీఎం ఆదేశించారు. టీచర్లకు శిక్షణ,
పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో
ప్రజంటేషన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
దేశమంతా మనవైపు చూస్తోంది

పటిష్ట పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసం
స్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో
ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పుతామని సీఎం
పేర్కొన్నారు. గణితాన్ని సులభంగా అర్ధం చేసు
కోవడానికి చికాగో యూనివర్శిటీ రాష్ట్ర ప్రభు



త్వంతో భాగస్వామి కానుందని చెప్పారు. ఉపా
ధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల మాధ్యమంలో బోధన
తదితర అంశాల్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ సహకారం
అందిస్తుందని వివరించారు. విద్యావ్యవస్థలో
తెస్తున్న మార్పులతో దేశమంతా ఏపీ వైపు
చూస్తోందన్నారు.

మధ్యాహ్న భోజనం జాగ్రత్త!

మధ్యాహ్న భోజనం నాణ్యత దెబ్బ తినకూడదని
సమీక్ష సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
'మధ్యాహ్న భోజన బకాయిలు లేకుండా చూస్తు
న్నాం. ఈ పథకంలో తల్లిదండ్రుల కమిటీలకు భాగ
స్వామ్యం కల్పించాలి. నాడు -నేడు కార్యక్రమం,
స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు భాగ
స్వామ్యం కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కెట్లు"

Post a Comment