తెలుగులో జేఈఈ మెయిన్‌!?


 కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం.. 2021 నుంచి అమలుకు యోచన
హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
తెలుగు విద్యార్థులకు శుభవార్త. ఇకపై జేఈఈ మెయిన్‌ పరీక్షను తెలుగులో కూడా నిర్వహించనున్నారు! ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్డీ) సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. పరీక్ష నిర్వహణపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయాన్ని 2021లో నిర్వహించే పరీక్షల నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ పరీక్షను ఇంగ్లిషు, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై తెలుగుతో పాటు అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, ఉర్దూ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50- 2 లక్షల వరకు విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుంటారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " తెలుగులో జేఈఈ మెయిన్‌!?"

Post a Comment