ఇక ఒత్తిడి లేని చదువు ఇష్టమైన సబ్జెక్టుల ఎంపిక 5 లేదా 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన 3-8 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు 3 భాషల పరిచయం విద్యాప్రగతి పర్యవేక్షణకు ప్రధాని ఛైర్మన్గా జాతీయ విద్యా కమిషన్ జాతీయ నూతన విద్యావిధానం ముసాయిదా నివేదికను కేంద్రానికి అందించిన కమిటీ ప్రజాభిప్రాయ స్వీకరణకు జూన్ 30 తుది గడువు
ఇష్టమైన సబ్జెక్టుల ఎంపిక
5 లేదా 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
3-8 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు 3 భాషల పరిచయం
విద్యాప్రగతి పర్యవేక్షణకు ప్రధాని ఛైర్మన్గా జాతీయ విద్యా కమిషన్
జాతీయ నూతన విద్యావిధానం ముసాయిదా నివేదికను కేంద్రానికి అందించిన కమిటీ
ప్రజాభిప్రాయ స్వీకరణకు జూన్ 30 తుది గడువు
కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్కు నివేదిక అందించింది. దాన్ని వెబ్సైట్లో ఉంచిన కేంద్రం జూన్ 30 లోపు ప్రజలు అభిప్రాయాలను పంపించాలని కోరింది.
కేంద్ర మానవ వనరుల శాఖను విద్యామంత్రిత్వ శాఖగా పిలవాలని ప్రతిపాదించింది. విద్యాప్రగతి పర్యవేక్షణకు ప్రధాని ఛైర్మన్గా జాతీయ విద్యాకమిషన్ను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
పాఠశాల, ఉన్నత విద్యకు సంబంధించి పలు మార్పులు చేయాలని సూచించింది. వచ్చే కొద్ది రోజుల్లోనే నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపిస్తారు
పాఠశాల విద్యలో మార్పులు
శిశు విద్య నుంచి 12వ తరగతి వరకు(ఇంటర్) పాఠశాల విద్యగా పరిగణిస్తారు. అంటే 3 సంవత్సరాలు పూర్తయిన పిల్లలు బడుల్లో చేరొచ్చు. ఆ మేరకు విద్యాహక్కు చట్టాన్ని విస్తరిస్తారు. అంటే ఇక భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాలు కూడా విద్యాశాఖలో భాగమవుతాయని స్పష్టమవుతోంది.
* ఇప్పటివరకు ఉన్న పాఠశాల విద్యా నిర్మాణం స్థానంలో 5+3+3-4 అనే నాలుగు భాగాలను చేరుస్తారు. 3-8 సంవత్సరాల మధ్య పిల్లలకు శిశు విద్యతోపాటు 1, 2 తరగతులు; 8-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు 3, 4, 5 తరగతులు, 11-14 ఏళ్ల మధ్య 6, 7, 8 తరగతులు, 14-18 ఏళ్ల మధ్య వయసున్నవారికి 9, 10, 11, 12 తరగతుల విధానం ఉంటుంది.
శిశు విద్య నుంచి 12వ తరగతి మొత్తం పాఠశాల విద్యలో భాగంగా ఉంటుంది. అంటే జూనియర్ కళాశాలల వ్యవస్థ ఉండదు.
* 8వ తరగతి వరకు మాతృభాషలో చదువుకోవాలి. కనీసం 5వ తరగతి వరకు తప్పనిసరి. 3-8 వయసు వరకు పిల్లలు వివిధ భాషలు సులువుగా నేర్చుకుంటారు. అందుకే వారికి మూడు భాషలను పరిచయం చేస్తారు. దానివల్ల వారు మాట్లాడటానికి వీలవుతుది.
* అవగాహన పెంచుకునేందుకు 9-12వ తరగతి విద్యార్థులందరికీ కరెంట్ అఫైర్స్ కూడా పాఠ్య ప్రణాళికలో ఉంటుంది.
* ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ దృకృథం పెంచేలా చదువు ఉంటుంది. నైతిక భావాలు, తార్కిక పరిశీలన, సాంఘిక, భావోద్వేగపరమైన అంశాలు, కమ్యూనికేషన్, నైతికత, డిజిటల్ విద్య, భారత్పై పరిజ్ఞానం, దేశంలోని ముఖ్యమైన సమస్యలను తెలుసుకునేలా సిలబస్ రూపొందిస్తారు.
* పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు సంస్కృతం ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు చదువుకోవచ్చు.
* మారుతున్న పరిస్థితుల్లో విదేశీ భాషలకు ప్రాధాన్యం పెరుగుతుంది. గతంలో మాదిరిగానే త్రిభాషా సూత్రం అమల్లో ఉంటుంది.
* వివిధ సబ్జెక్టులపై ఒలింపియాడ్, ఇతర పోటీ పరీక్షలను మరింత ప్రోత్సహిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడ్లలో పాల్గొనేందుకు కేంద్రం నిధులిస్తుంది.
* ప్రైవేటు పాఠశాలలు రుసుములను నిర్ణయించుకోవచ్చు. కానీ, ఇష్టారాజ్యంగా రుసుములు పెంచరాదు.
ఉన్నత విద్యలో
* ఇక అనుబంధ కళాశాలలు ఉండవు. విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ ఇచ్చే స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలు మాత్రమే ఉంటాయి. అంటే ఇక ప్రతి కళాశాల స్వయంప్రతిపత్తి వైపు అడుగులేయాలి.
* రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ లేదా జాతీయ విద్యాకమిషన్ను ఏర్పాటు చేయాలి. దానికి ప్రధాని ఛైర్మన్గా ఉంటారు. ఏటా ఒకసారి సమావేశమై విద్యావ్యవస్థ ప్రగతిని సమీక్షించాలి.
* యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్సీటీఈ తదితర నియంత్రణ సంస్థల స్థానంలో ఉన్నత, సాంకేతిక విద్యాసంస్థలకు కలిపి జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ(ఎన్హెచ్ఈఆర్ఏ)ను ఏర్పాటు చేయాలి.
* బ్యాచులర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్(బీఎల్ఏ) లేదా బ్యాచులర్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్(బీఎల్ఈ) పేరిట నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలి.
కొత్త విధానంపై తమిళ నేతల అభ్యంతరం
ఈనాడు డిజిటల్, చెన్నై: నూతన జాతీయ విద్యా విధానం-2019 ముసాయిదా రూపొందిన నేపథ్యంలో తమిళనాడులోని విపక్షాలు భగ్గుమన్నాయి. నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్రంలో హిందీని అమలు చేయాలని చూస్తే 1965లో చోటుచేసుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమం పునరావృతం అవుతుందని ఎండీఎంకే నేత వైగో పేర్కొన్నారు. నూతన విద్యావిధాన ముసాయిదా చర్య సరికాదని ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఏ భాషకైనా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందని డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. నేర్చుకునే భాషకు తప్పనిసరి అని చెప్పడం సరికాదని ఎంఎన్ఎం అధినేత కమల్హాసన్ అన్నారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగొట్టయ్యన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ద్విభాషా విద్యా విధానం కొనసాగుతుందని చెప్పారు.
నివేదిక మాత్రమే... ప్రభుత్వ నిర్ణయం కాదు
కేంద్రమంత్రి ప్రకాశ్ జావ్డేకర్ స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులపై బలవంతంగా హిందీ రుద్దబోతున్నారంటూ వస్తున్న వార్తలను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్ జావ్డేకర్ ఖండించారు. నూతన విద్యా విధానంపై కమిటీ ఇచ్చిన నివేదిక కేవలం ముసాయిదా మాత్రమేనని, దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ‘‘నూతన విద్యావిధాన రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించినట్లు అపార్థం చేసుకుంటున్నారు. అందులో నిజంలేదు. ముసాయిదా విధానంపై ప్రజాభిప్రాయసేకరణ చేసిన తర్వాతే అది ప్రభుత్వం ముందుకొస్తుంది. మోదీ ప్రభుత్వం అన్ని భారతీయ భాషలనూ ప్రోత్సహిస్తూ వస్తోంది. ఎవరిపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
1) Each student has to be educated to increase the scientific perspective. The syllabus is designed to learn ethical feelings, logical observation, social, emotional issues, communication, morality, digital education, knowledge on India, and the country's major issues.
ReplyDelete* 2) Sanskrit ranges from higher education to Sanskrit as an optional subjects. Those who are interested can read.
In foreign exchange, foreign languages will increase. As in the past, the three-dimensional formula is in force.
* 3) Olympiad and other competitive examinations will be encouraged on various subjects. The Center will participate in the International Olympiads.
*4) Private schools may charge fees. However, the fees should not be increased.
These 4 points are very important for future generation.first point is most important if you possible introduce THE BHAGAVADGEETA depend up on the level of class and also every student must be life settled courses,at the same time improve the NATIONAL HUMAN RESOURCED COURSES.