ఏపీ వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసనFeb
మెరుగైన పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ... వారం రోజులపాటు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కలిసి వచ్చే ఉద్యోగులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 11న కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామని, 12న రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తమ డిమాండ్స్, హక్కులు సాధించుకుంటామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు
0 Response to "ఏపీ వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసనFeb"
Post a Comment