జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి‌ప్‌లలో పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు

మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు పట్టణాల్లో నిర్మించదలచుకున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్పులకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. 



ఉద్యోగులకు 20శాతం రిబేట్‌తో 10శాతం ప్లాట్లు కేటాయించాలని గతేడాది జూలై 28న విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 



వీటితోపాటు పెన్షనర్లకు అదనంగా మరో 5శాతం అంటే మొత్తం 15శాతం ప్లాట్లను ఉద్యోగులు, 




రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉమ్మడి కేటాయింపులు చేయాలని మున్సిపల్‌ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి‌ప్‌లలో పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు"

Post a Comment