రద్దు చేసే వరకూ పోరాటం: ఫ్యాప్టో

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్లకు వేతనాలు తగ్గిపోయేలా ఇచ్చిన తిరోగమన జీవోలను రద్దు చేయాలంటూ నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని ఫ్యాప్టో పేర్కొంది. న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా లేని ప్రభుత్వం చివరకు చావు ఖర్చులకు చెల్లించే డబ్బు విషయంలోనూ కక్కుర్తి పడుతోందని విమర్శించింది. ఐఆర్‌ కంటే 4 శాతం తక్కువగా ఫిట్‌మెంట్‌ ఇచ్చారని, పోరాడి సాఽధించుకున్న ఇంటి అద్దెల్లో కోత పెట్టారని, సీసీఏ రద్దు చేశారని విమర్శించింది. గత ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న అదనపు క్వాంటమ్‌ పింఛన్‌ను రద్దు చేయడం దారుణమని  ఒక ప్రకటన విడుదల చేసింది. న్యాయపరమైన కోర్కెల సాధనకు శాంతియుతంగా ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్టు చేయడాన్ని ఫ్యాప్టో నేతలు తీవ్రంగా ఖండించారు. రివర్స్‌ పీఆర్సీని రివర్స్‌ చేసేవరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రద్దు చేసే వరకూ పోరాటం: ఫ్యాప్టో"

Post a Comment