నేడు మంత్రివర్గ సమావేశం.. పీఆర్సీపై చర్చించే అవకాశం
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి వర్గం శుక్రవారం సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు ఆర్డినెన్సులకు ఆమోద ముద్ర వేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పీఆర్సీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైనా చర్చ జరిగే వీలుందని సమాచారం. ఉద్యోగ సంఘాల నేతల వాదనల్లో వాస్తవం లేదని పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులను సీఎం ఆదేశించే అవకాశం ఉందని తెలిసింది.
ఇప్పటికే ప్రభుత్వం తన సోషల్ మీడియాలో పీఆర్సీపై ప్రచారం ప్రారంభించింది. సంక్షేమ కేలెండరును కూడా కేబినెట్ ఆమోదిస్తుందని అంటున్నారు
0 Response to "నేడు మంత్రివర్గ సమావేశం.. పీఆర్సీపై చర్చించే అవకాశం"
Post a Comment