7న ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
దిల్లీ: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘శిక్షాపర్వ్’లో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యారంగంలోని ఇతర భాగస్వాములను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 7న ప్రసంగించనున్నారు. ఉపాధ్యాయుల అవిరళ కృషిని గౌరవించడానికి దీనిని నిర్వహిస్తున్నారు. సంజ్ఞల భాషకు సంబంధించి 10,000 పదాలతో రూపొందించిన నిఘంటువును, దృష్టిలోపం ఉన్నవారి కోసం తయారైన ఆడియో పుస్తకాలను
ఆవిష్కరించడంతో సహా అయిదు ప్రారంభోత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు 44 మందికి పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెబినార్ ద్వారా ప్రదానం చేస్తారని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు
ఆవిష్కరించడంతో సహా అయిదు ప్రారంభోత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు 44 మందికి పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెబినార్ ద్వారా ప్రదానం చేస్తారని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు
0 Response to "7న ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని"
Post a Comment