నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
దిల్లీ: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆయన ప్రసంగాన్ని సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయనున్నారు.
ఆ తర్వాత రాత్రి 9.30కు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తారు. దూరదర్శన్లో తొలుత హిందీలోనూ, అనంతరం ఇంగ్లిష్లోనూ ప్రసారం కానుంది.
ఆ తర్వాత అన్ని ప్రాంతీయ దూరదర్శన్ ఛానళ్ల ద్వారా ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఆదివారం ప్రకటించాయి
0 Response to "నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం"
Post a Comment