టెన్త్‌ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు

*♓టెన్త్‌ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు..*

*♓ᵏరేపటి నుంచి అమలు..*

*♓ᵏ103 రోజుల ప్రణాళిక..*

*♓ᵏఅదే రోజు నుంచి ఇంటర్‌..*

*♓ᵏఫస్టియర్‌ క్లాసులూ ప్రారంభం..* 

*♓ᵏవేసవి సెలవులు రద్దు..*

ఒంగోలు విద్య, జనవరి 16 :
*♓ᵏపదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు  జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు.*

*♓ᵏరేపటి నుంచి ఆరో తరగతి క్లాసులు..*

*♓ᵏప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి  క్లాసులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు*. 

*♓ᵏఇంటర్‌కు 106 పనిదినాలు..*

*♓ᵏఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు  సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "టెన్త్‌ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు"

Post a Comment