డిజిటల్ బోధన'లో టీచర్లకు ఉచిత శిక్షణ
ముంబయి: డిజిటల్ శకంలో 'టెక్నాలజీ వినియోగంతో బోధన'పై 15 రోజుల ఉచిత కోర్సును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి చెందిన టీసీఎస్ అయాన్ ప్రారంభించింది.
'కెరీర్ ఎడ్జ్ - డిజిటల్ టీచర్' పేరిట రూపొందించిన ఈ ఆన్లైన్ కోర్సులో టీచర్లు ఎవరైనా చేరి, తమ డిజిటల్ బోధన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పుడు లక్షలాది మంది టీచర్లు తరగతుల నిర్వహణకు డిజిటల్ సాధనాలను వినియోగించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లకు ప్రత్యేకంగా అవసరమైన నైపుణ్యాలు, ఆధునాతన బోధన విధానాలు వంటివి ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు
రోజుకు 1-2 గంటల పాటు సమయం వెచ్చిస్తే సరిపోయేలా దీనిని రూపకల్పన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు అభినందనలు తెలుపుతూ ఈ కోర్సును అందిస్తున్నట్లు టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి తెలిపారు
How to enroll the digital teaching course
ReplyDelete