కొత్త విధానాలనకు అనుగుణంగా విద్యాబోధన

వన్‌టౌన్‌: కరోనా ఎపిడిమిక్‌ నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలకు అనుగుణంగా వైద్య విద్యా బోధన చేపట్టాలని ఎన్టీఆర్‌ ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. ఏపీ వైద్య విద్యావేత్తల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నుంచి జరిగిన వర్చువల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు.



 కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ వైద్య విద్య బోధనను కొనసాగిస్తూ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. పీజీలకు వర్చువల్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కొవిడ్‌ నేపథ్యంలో తరగతుల నిర్వహణపై చర్చించారు. 


వైద్య విద్యావేత్తల సంఘం అధ్యక్షుడు, ఎఎంసి విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ కె.ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైద్య రంగ ప్రముఖులు డాక్టర్‌ అవినాష్‌, డాక్టర్‌ సంజీవ్‌, డాక్టర్‌ విజయకుమార్‌, డాక్టర్‌ రావి వెంకటాచలం, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్‌ అల్లాడి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కొత్త విధానాలనకు అనుగుణంగా విద్యాబోధన"

Post a Comment