పాఠశాలల్లో బాల సాహిత్యం

*✨ పాఠశాలల్లో బాల సాహిత్యం*

★ బాలల కోసం సాహితీవేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులతో ప్రత్యేక పుస్తకాలను రూపొందించే కార్యక్రమానికి విద్యా శాఖ శ్రీకారం.

★ విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, వారిలో గుణాత్మక మార్పు తీసుకురావాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

★ గ్రంథాలయాల్లో ఎక్కువ సమయం గడుపుతూ కథల పుస్తకాలు చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయి అభ్యసనాలు కలిగి ఉన్నారని 2017లో నిర్వహించిన జాతీయ మదింపు సర్వేలో వెల్లడైంది.

★ ఈనేపథ్యంలో గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పన, కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది.

★ తాజాగా గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు కొత్త పుస్తకాలను సమకూర్చాలని నిర్ణయించింది.

★ బొమ్మల పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలు, ప్రత్యేక అంశాలకు చెందిన పుస్తకాలు, నిఘంటువులు, ఆడియో విజువల్‌ మెటీరియల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ విధానంపై పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లిస్తారు.

★ ఇందుకు ప్రతి పాఠశాలలో రీడింగ్‌ కార్నర్స్‌, పోయమ్‌ కార్నర్‌, మెసేజ్‌ బోర్డులు, జానపద విభాగాలను ఏర్పాటు చేస్తారు.

★ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల కోసం బాలసాహిత్యం, 

★ సెకండరీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కౌమార సాహిత్యం అందుబాటులో ఉంచుతారు.

             

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల్లో బాల సాహిత్యం"

Post a Comment