ఉపాధ్యాయులతోనే ప్రగతిశీల సమాజం: గవర్నర్ విశ్వభూషణ్

అమరావతి: ఉపాధ్యాయులతోనే ప్రగతిశీల సమాజం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయిలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. 



ఉపాధ్యాయులుసమాజం యొక్క వాస్తుశిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్  ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాక తత్వవేత్తగా, రచయితగా భారత దేశానికి సేవలు అందించారన్నారు. 




సర్వేపల్లి తన జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయుడని గవర్నర్ విశ్వభూషణ్ కొనియాడారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉపాధ్యాయులతోనే ప్రగతిశీల సమాజం: గవర్నర్ విశ్వభూషణ్"

Post a Comment