నగదు బదిలీ నేరుగా సంస్థలకే

  • రైతులకు అపోహలు అనవసరం: మంత్రి బాలినేని

అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ మోటార్లు ఉన్న రైతుల పేరుతో తెరిచే నగదు బదిలీ ఖాతాల నుంచి సొమ్మును ఎవరూ ఉపసంహరించుకోవడం సాధ్యంకాదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 



ఆదివారంరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, బ్యాంకులు ఆ డబ్బును ముట్టుకోలేవని, ప్రభుత్వం ఆ ఖాతాల్లో వేసిన వెంటనే ఆ సొమ్ము విద్యుత్‌ సంస్థల ఖాతాలకు వెళ్లిపోతుందని ఆయన వివరించారు. దీనిపై రైతులెవరూ అపోహలు పెట్టుకోవద్దని కోరారు. వ్యవసాయ కనెక్షన్లను కుదిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, 


ఇప్పుడు అందుతున్న ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వేసే డబ్బులు ఆలస్యమైనా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ నిలిపివేయరాదని సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. 


నగదు బదిలీ పథకాన్ని ముందుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకంపై సందేహాలకు 1912 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నగదు బదిలీ నేరుగా సంస్థలకే"

Post a Comment