ఇప్పటికే దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సము సృష్టించాయి. ఇక తాజాగా దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళ పుదుచ్చేరి సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది
0 Response to "రెయిన్ అలర్ట్..దేశవ్యాప్తంగా 3 రోజులపాటు భారీ వర్ష సూచన"
Post a Comment