‘స్కూలు ఫీజుల్లో 25 శాతం తగ్గింపు
గాంధీనగర్:
గుజరాత్లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్సు ఫీజుల్లో 25 శాతం
తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ర్ట విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా
తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు
చేసుకున్నాయని, ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా
సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి అంగీకరించాయని ఆయన వివరించారు.
ఈరకు పాఠశాలల యాజమాన్యాలతో విద్యాశాఖ పలుసార్లు చర్చలు జరిపినట్లు ఆయన
తెలిపారు. ఈ తగ్గింపు సీబీఎస్ఈ పాఠశాలల్లోనూ వర్తింస్తుందని మంత్రి
పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు 30 శాతం మేర ఫీజులు తగ్గించాలని
ఒడిశా విద్యాశాఖ అక్కడి యాజమాన్యాలను కోరింది. దీనిపై తుది నిర్ణయం
వెలువడాల్సి ఉంది
0 Response to "‘స్కూలు ఫీజుల్లో 25 శాతం తగ్గింపు"
Post a Comment