ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది
*✨2018-19 పన్ను రిటర్న్స్*
════ ❈ ════
★ ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది.
★ కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది.
★ గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019-20 అవుతుంది.
★ అంటే 2020 మార్చి నాటికి 2018-19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది.
★ మళ్లీ జూలై 31 వరకూ పెంచింది జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది
★ 2018-19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ను పంపుతోంది.
▒░
0 Response to " ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది"
Post a Comment