రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు : అజయ్ భల్లా

అమరావతి/ న్యూ ఢిల్లీ : రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య విధించిన ఆంక్షల గురించి ఈ లేఖలో ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేశారు. సరుకు రవాణా, వ్యక్తుల రాకపోకలకు అనుమతుల అవసరం లేకుండా చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల మధ్య ఆంక్షలు ఉన్నట్లు తమ దృష్టికొచ్చిందని.. అలాంటి ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి దెబ్బతింటుందని లేఖలో అజయ్‌ భల్లా రాసుకొచ్చారు



రాకపోకలపై రాష్ట్రాల ఆంక్షలు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు వ్యతిరేకం అని కూడా ఆయన తెలిపారు. 2005లోని ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని మార్గదర్శక సూత్రాలకు కూడా విరుద్ధమన్నారు. సరిహద్దుల్లో ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాలని సీఎస్‌లకు రాసిన లేఖలో కేంద్రం హోం శాఖ కార్యదర్శి నిశితంగా పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు : అజయ్ భల్లా"

Post a Comment