మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నానని, కొద్దిసేపటి క్రితమే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినట్లు అభిజిత్ ట్వీట్లో వెల్లడించారు. వైద్యులు ఆయన కోలుకోవాలని తీవ్రంగా శ్రమించారని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కోరుకున్నారని.. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆగస్ట్ 10న ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు మెదడుకు సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స అనంతరం ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్దిరోజుల నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు.
ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన మరిన్ని వివరాలివి..
1935 డిసెంబర్ 11న ప్రణబ్ ముఖర్జీ జననం
స్వగ్రామం పశ్చిమ బెంగాల్ బిర్భుమ్ జిల్లాలోని మిరాఠీ
1969లో ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రవేశం
2012 జులై 25 నుంచి ఐదేళ్ళపాటు భారత రాష్ట్రపతి
ఇందిరాగాంధీ, పీవీ, మన్మోహన్ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రి
కేంద్రంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా సేవలు
ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడు
రాజకీయాల్లోకి రాకముందు తపాలాశాఖలో యూడీసీగా పనిచేసిన ప్రణబ్
0 Response to "మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత"
Post a Comment