ఏపీలో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా జెట్ స్పీడుతో వెళ్తోంది. ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 85 మంది మృతి చెందారు. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 3,969 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4 లక్షల 34 వేల 771కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 1,00,276 యాక్టివ్ కేసులునట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా నుంచి 3,30,526 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 37.22 లక్షల కరోనా టెస్టులు చేశారు. 



నెల్లూరు 12, చిత్తూరు 9, ప్రకాశం 9, కడప 8 మంది కరోనా వల్ల మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు ఏడుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 4, కృష్ణా 2, విజయనగరంలో ఒకరు మృతి చెందారు. తూర్పుగోదావరి 1,383, నెల్లూరు 1,086, శ్రీకాకుళం 1,023, పశ్చిమగోదావరి జిల్లాలో 1,142 కొత్త కేసులు నమోదయ్యాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదు"

Post a Comment