అప్పటి వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. స్పష్టం చేసిన కేంద్రం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కరోనా తగ్గే వరకు ఇలా మూసి ఉంచుతారా? లేదంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్కూళ్లకు అనుమతులిస్తారా? అని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఐతే పలు రాష్ట్రాలు ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేసినా.. పలు రాష్ట్రాలు స్కూళ్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆగస్టు 31 వరకు స్కూళ్లు, కాలేజీలను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
జులై 31న అన్లాక్ 2 ముగుస్తున్న నేపథ్యంలో అన్లాక్ 3 గైడ్ లైన్స్ను కేంద్రహోంశాఖ ప్రకటించింది. కంటోన్మెంట్ జోన్ల బయట మరిన్ని సడలింపులు ఇచ్చింది
జులై 31న అన్లాక్ 2 ముగుస్తున్న నేపథ్యంలో అన్లాక్ 3 గైడ్ లైన్స్ను కేంద్రహోంశాఖ ప్రకటించింది. కంటోన్మెంట్ జోన్ల బయట మరిన్ని సడలింపులు ఇచ్చింది
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ యోగా సెంటర్లు, జిమ్లను నిర్వహించుకోవచ్చని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేసే ఉంటాయని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్రం
0 Response to "అప్పటి వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. స్పష్టం చేసిన కేంద్రం"
Post a Comment