ఏపీలో కొత్తగా 7948 కేసులు, 58 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసుల తాజా
బులెటిన్ విడుదలయ్యింది. గత 24 గంటల్లో 62వేల 979 శాంపిల్స్ పరీక్షించగా
7948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3064 మంది కోవిడ్ నుంచి కోలుకుని
డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా 58 మంది
చనిపోయారు. తాజా గణాంకాల
ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 1148 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం
1,07,402 పాజిటివ్ కేసులకు గాను.. 49,745 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో
56,509 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు
0 Response to "ఏపీలో కొత్తగా 7948 కేసులు, 58 మంది మృతి"
Post a Comment