పదో తరగతి పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, * పత్రికా ప్రకటన తేది 20.6.2020 2019-20వ సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019-20 విద్యాసంవత్సరానికిగానూ జూలై 10 నుంచి 17 దాకా జరపవలసినపదోతరగతి పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. 18.6.2020న గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై'యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గారి సమక్షంలో పారశాల విద్యాశాఖామాత్యులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ గారితోను, అంతకంతకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో శాఖ మరియు ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖాధికారులతోనూ జరిగిన సమావేశంలో సమగ్రంగా చర్చించిన తర్వాత పరీక్షల నిర్వహణ కష్టనష్టాలను జాగ్రత్తగా అంచనా వేశాక, విద్యార్ధుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పదోతరగతి పరీక్షలను తప్పనిసరిగా జరపాలనే కృతనిశ్చయంతో పాఠశాల విద్యాశాఖ ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే పదోతరగతి విద్యార్ధులకు గత రెండు నెలల నుండి కరోనా రోజుల్లో సప్తగిరి ధానెల్‌ ద్వారా 'విద్యామృతం' మరియు ఆకాశవాణి ద్వారా 'విద్యాకలశం' అనే పేరుతో పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది. పదోతరగతి పరీక్షలను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు తగ్గించడంతో పాటు, సెంటర్లను పెంచడం, అదనపు సిబ్బంది నియమాకం, కోవిడ్‌ నివారణ చర్యలు, భౌతిక దూరం వంటి ఎన్నో చర్యలు చేపట్టింది. 



15.6.2020నగౌరవ విద్యాశాఖామాత్యులు జిల్లా అధికారులతోనూ, ఉపాధ్యాయ సంఘాలతోను, తల్లిదండ్రుల సంఘాలతోను జరిపిన వీడియో కాన్సరెన్పులో దాలామంది తల్లిదండ్రులు పదోతరగతి పరీక్షల సందర్భంగా కరోనా పరిస్థితుల దృష్ట్యా, పిల్లల ఆరోగ్య భద్రత గురించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ పరీక్షలకు వెళ్లిన సమయంలోనూ, తిరిగి ఇంటికివెళే సమయంలో విద్యార్ధులు భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందనీ, దానివల్ల కరోనా సోకి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాళ్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూలై నాటికి మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వివిధ సర్వేలు సూచిస్తున్న దృష్ట్యా, కంటైన్మెంట్‌ జోన్లు పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణ మరింత కష్టతరంగా ఉంటుందని గౌరవ మంత్రివర్యుల




. అంతేకాక తాము అత్యంత శ్రద్ధతో బాధ్యతతో పరీక్షల నిర్వహణ సెంబద్ధతను వ్యక్తం చేయలేమని చెప్పారు. ఇదికాక పరీళ్ష నిర్వహ స ప్రనాణకు పెద్ద ఎత్తున మాస్కులు, శానిటైజర్లు తదితర నివారణ సామగ్రి కూడా సమకూర్చవలసి ఉంటుందని వివరించారు. ఇప్పటికే చాలా పాఠశాలలు క్వారంటైన్‌ కేంద్రాలుగా పనిచేస్తుండటం ఎల్ల వాటిలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలియపరిదారు. దాలాచోట్ల అంతరజిల్లా , జిల్లా స్థాయి రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరింపటడని వల్ల దూరప్రాంతానికి చెందిన విద్యార్ధులు పరీక్షలకు హాజరుకావడం, అలాగే హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్ధులు హాస్టళ్లకు, గురుకుల పారశాలకు చేరుకోవడం కూడా కష్టమని తెలియజేశారు. కేవలం పదో తరగతి విద్యార్థుల కోసమే హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు తెరిచినప్పటికీ విద్యార్దుల మధ్య భౌతిక దూరం పాటించడం, భోజనం తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం సవాళ్లుగా మారుతాయని తెలియపరిచారు. పై అంశాలన్నీ జాగరూకతతో పరిశీలించిన తర్వాత, పారశాల విద్యాశాఖామాత్యులు, పారశాల విద్యాశాఖ, ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖ అధికారులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కరోనా నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రానున్న పరిస్టితులను దృష్టిలో పెట్టుకుని పెల్లల ఆరోగ్యభద్రత ప్రధానమని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గారు భావించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణత చేసేలా నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, పరీక్షలకు హాల్‌ టికెట్ల పొందిన విద్యార్థులను ఉత్తీర్ణత చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ముఖ్యంగా కరోనా నేపధ్యంలో ఏ ఒక్కతల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందనవసరం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలతో నిమిత్తం లేకుండానే ఉత్తీర్ణతలు చేయాలని ఆదేశించారు. అయితే కొన్ని ఉన్నత విద్యావకాశాలకు విద్యార్దుల మార్కులు, గ్రేడింగ్‌ అవసరమైన దృష్ట్యా విద్యార్ధులకు ఉత్తీర్ణతతో పాటు గ్రేడింగ్‌ కూడా ఇవ్వడానికి తగిన విధి విధానాలను రూపొందించవలసిందిగా పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించడమైనది. అలాగే, ఇంటర్మీడియేట్‌ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలలో ఫెయిలైన విద్యార్ధులను కూడాసప్లిమెంటరీ పరీక్షలు లేకుండాఉిత్తీర్ణత చేయాలని నిర్ణయం తీసుకోవడం




!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు



అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి వల్ల పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేశ్‌ తెలిపారు.


publish-time 20/06/2020 | 17:17 IST

🌺 *బ్రేకింగ్ న్యూస్...* 🌺


🌺 *AP లో _10వ తరగతి పరీక్షలు రద్దు.._*


*FA-1,2 & SA-1 మార్కుల ఆధారంగా గ్రేడులు..*


పూర్తి వివరాలు...


.




LIVE NEWS IN TV9









SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పదో తరగతి పరీక్షలు రద్దు"

Post a Comment