కరోనా ఎఫెక్ట్...ఆర్టీసీ బస్సుల్లో సీట్ల మార్పు

విజయవాడ: కరోనా వైరస్ నేపథ్యంలో  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం సీట్ల మార్పు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. తొలిప్రయత్నంగా మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే సూపర్ లగ్జరీ బస్సులలో 36 సీట్లను 26కు కుదించారు.



కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటించేలా ఆర్టీసీ అధికారులు సీట్లను కుదించారు. తొలినమూనా బస్‌ను ఆటోనగర్ డిపోలో రూపొందించారు.

ఉన్నతాధికారులు పరిశీలన అనంతరం వారి ఆమోదముద్రతో మరిన్ని బస్సులు రూపకల్పన చేసే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా ఎఫెక్ట్...ఆర్టీసీ బస్సుల్లో సీట్ల మార్పు"

Post a Comment