ఏపీలో 2137 పాజిటివ్

 ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.

 నిన్న అతి తక్కువగా 33 కేసులతో తగ్గుముఖం పడుతోందని భావిస్తుండగా.. మహారాష్ట్ర నుంచి వలస కార్మికులను తీసుకొచ్చిన శ్రామిక్‌ రైలు వారితోపాటు.. కరోనా వైరస్‌నూ మోసుకొచ్చింది. థానే నుంచి రాష్ర్టానికి వచ్చిన 930 మంది వలస కార్మికుల్లో మంగళవారం 38 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో తీవ్ర కలకలం రేపింది.


 నేడు కూడా 48 మందికి కరోనా పాజిటివ్ రావడంతో  ఏపీలో ఒక్కసారిగా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో గత 24 గంటల్లో 9284మంది కోవిడ్-19 సాంపిల్స్‌ని పరీక్షించగా 48 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 8మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని ఏపీ ప్రభుత్వం చెప్పింది.


 ఇప్పటి వరకు ఏపీలో 2137 పాజిటివ్ కేసులకు గాను 1142 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 47 మంది మరణించగా,948 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 



నేడు గుంటూరు (12), చిత్తూరు (11) అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలుకు చెందిన ఒక్కరు మరణించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 2137 పాజిటివ్"

Post a Comment