నేటి నుంచి రైట్ రైట్.. 1,683 బస్సులు సిద్ధం పల్లెవెలుగుకూ ఆన్లైన్ రిజర్వేషన్
‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు గురువారం ఉదయం నుంచి ఆరంభం కానున్నాయి. ఆన్లైన్ బుకింగ్ బుధవారం సాయంత్రం నుంచి ఆరంభించాం.
436 మార్గాల్లో 1,683 బస్సులు (17 శాతం) నడపనున్నాం. పరిమిత సీట్లలోనే ప్రయాణికులను అనుమతిస్తాం. ఛార్జీలు ఏమీ పెంచలేదు’ అని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఎం.ప్రతాప్ తెలిపారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. - ప్రయాణికులు తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
* బస్టాండ్ల మధ్య మాత్రమే ప్రస్తుతానికి బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతాం.
* ప్రస్తుతానికి బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు.
* అవసరమైతేనే ఏసీ బస్సులు నడుపుతాం. అందులో కూడా 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతాం. దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాలి. అటెండరు ఉండరు.
* దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల్లోపే బస్టాండ్లకు చేరుకోవాలి. సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం.
* 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దు.
* లాక్డౌన్ పూర్తయ్యాక విశాఖ, విజయవాడల్లో సిటీబస్సులు నడపడంపై నిర్ణయం తీసుకుంటాం.
* హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు వీలుగా బస్ సర్వీసులకు అవకాశం కల్పించాలని ఆ రాష్ట్రాల సీఎస్లకు మన సీఎస్ లేఖలు రాశారు. ఇంకా అనుమతి రావాల్సి ఉంది.
ప్రధాన రూట్లలో బస్సులకు డిమాండ్
ఆర్టీసీ ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (ఓపీఆర్ఎస్)లో టిక్కెట్ల బుకింగ్కు బుధవారం సాయంత్రం తర్వాత అవకాశం కల్పించడంతో ప్రధాన మార్గాల్లో బస్సులకు సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. దీంతో అధికారులు అప్పటికప్పుడు మరో బస్సుకు టికెట్ బుకింగ్ అవకాశం కల్పించారు
* బస్సుల్లో కండక్టర్లు ఉండరు.
* అన్ని బస్సులకూ ఆన్లైన్ రిజర్వేషన్.
* అన్ని బస్టాండ్లలోనూ కరెంట్ బుకింగ్.
* కౌంటర్లో టికెట్ కొనుగోలు చేసేవారి పేరు,
* కౌంటర్లో టికెట్ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్ నంబరు నమోదు
0 Response to " నేటి నుంచి రైట్ రైట్.. 1,683 బస్సులు సిద్ధం పల్లెవెలుగుకూ ఆన్లైన్ రిజర్వేషన్"
Post a Comment