చదువుతున్న స్కూళ్లలోనే సీబీఎస్‌ఈ పరీక్షలు

సీబీఎ్‌సఈతోపాటు ఆయా రాష్ర్టాల బోర్డుల 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 



ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కట్టడి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. 



అవసరమైతే పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు.


10, 12 తరగతుల సీబీఎస్‌ఈ పరీక్షలను బయటి పరీక్షా కేంద్రాల్లో కాకుండా విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహించనున్నారు. 


ఈ పరీక్షల ఫలితాలను జూలై చివరికల్లా విడుదల చేయాలని మానవ వనరుల అభివృద్ధి  శాఖ యోచిస్తోంది. లాక్‌డౌన్‌ కన్నా ముందు నిర్వహించిన పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.



 కాగా, ఆన్‌లైన్‌ ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానంలో ఢిల్లీ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతుండగా.. 



ఆ పరీక్షలు రాయలేమని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ నిర్వహించిన సర్వేలో 68శాతం అభిప్రాయపడ్డారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చదువుతున్న స్కూళ్లలోనే సీబీఎస్‌ఈ పరీక్షలు"

Post a Comment