ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్



ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్

దిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 


పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ వెల్లడించింది

ఐదు లక్షల రూపాయల్లోపు ఉన్న రిఫండ్‌లను తక్షణం విడుదల చేయనున్నారు. 





ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఉపశమనం లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపారులకూ లబ్ధి చేకూరనుంది. 




ఎంఎస్‌ఎంఈలకూ ఇది వర్తిస్తుంది. రిఫండ్‌ల చెల్లింపుల కోసం మొత్తం రూ.18 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్"

Post a Comment