వేతనాల కోతపై హైకోర్టులో విచారణ



వేతనాల కోతపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను తెలంగాణ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.




 సీనియర్‌ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్‌ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మరో న్యాయవాది కరుణసాగర్‌ రాసిన లేఖను కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని న్యాయవాది ప్రస్తావించారు. ప్రజలు గుమిగూడుతున్న ప్రాంతాల్లో వైరస్‌, బ్యాక్టీరియాను నిర్మూలించే టన్నెల్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది జి.రొనాల్డ్‌ రాజు రాసిన మరో లేఖను కూడా హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వేతనాల కోతపై హైకోర్టులో విచారణ"

Post a Comment