విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుండి ప్రారంభ మయ్యేటట్లు చూడాలి నిపుణుల కమిటి నివేదిక
న్యూదిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్లైన్ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.
శుక్రవారం ఇవి తమతమ నివేదికలను సమర్పించాయి.
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు..
ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరాన్ని ఈసారి సెప్టెంబరుకు జరపాలని హరియాణా యూనివర్సిటీ వీసీ ఆర్సీ కుహాడ్ నేతృత్వంలోని మొదటి కమిటీ సూచించింది.
ఇగ్నో వీసీ నాగేశ్వరరావు సారథ్యంలోని రెండో కమిటీ.. ‘సరైన వసతులు ఉంటే విశ్వవిద్యాలయాలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షంలో లాక్డౌన్ ముగిశాకే పరీక్షలు పెట్టాల’ని తెలిపింది.
మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) మంత్రిత్వశాఖ ప్రస్తుతం ఈ రెండు నివేదికలను పరిశీలిస్తోంది.
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జేఈఈ, నీట్ పరీక్షలను జూన్లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం.. కానీ ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించడం కూడా ముఖ్యమని ఒక ఉన్నతాధికారి వివరించారు
0 Response to "విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుండి ప్రారంభ మయ్యేటట్లు చూడాలి నిపుణుల కమిటి నివేదిక"
Post a Comment