నూతన విద్యా సంవత్సరం.. సెప్టెంబరు నుంచి!

కొవిడ్‌-19 వ్యాప్తి మరింత కాలం ఉండొచ్చనే..

ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ

యూజీసీ పరిశీలనలో కమిటీల సిఫారసులు

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): 2020-21 విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అనివార్యంగా పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన పరిస్థితి రానుంది. ఈ అంశాలపై యూజీసీ పరిశీలన జరుపుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా అన్ని 



విశ్వవిద్యాలయాలులు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరం ముగిసినట్లే. ఇక ఉన్నత, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. 



కరోనా నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభించాలి? విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశాలపై పరిశీలన జరిపేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు శుక్రవారం నివేదికలను యూజీసీకి సమర్పించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నూతన విద్యా సంవత్సరం.. సెప్టెంబరు నుంచి!"

Post a Comment