ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఫైల్ రడి
డీఎస్సీకి ముందు ఉపా ధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రం సిద్ధం చేసింది.
ఉపాధ్యాయ నియా మక పరీక్ష(టీఆర్టీ), టెట్ను విడివిడిగా నిర్వహించా లని నిర్ణయించింది. డీఎస్సీ-2018 పోస్టుల భర్తీ పెండిం గ్లో ఉన్నందున ఆ నియామక ప్రక్రియ అయ్యేలోపు టెట్ పూర్తిచేయాలని భావిస్తున్నారు.
ఏటా రెండు పర్యాయాలు టెట్ నిర్వహించాల్సి ఉండగా గత డీఎస్సీ తోపాటే నిర్వహించారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగు తుండడంతో నిర్లీత తేదీలను ప్రకటించకుండానే నిర్వహ ణకు దస్త్రాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి అను మతి వచ్చిన తర్వాత షెడ్యూల్ను నిర్ణయిస్తారు. ఈ
ఏడాదీ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించాలని భావిస్తు న్నారు. గతంలోనే టెట్ను ఆన్లైన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉద్యోగ నియామకాల కేలండర్ను సిద్ధం చేయాలని చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ ఖాళీలను సేకరించింది. ఈ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ ఖాళీలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 8వేల పోస్టులకు డీఎస్సీ ప్రకటన వచ్చే
అవకాశం ఉంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 3వేలు, టీజీటీ, పీజీటీలు 800, మిగతావి ఎస్టీటీ పోస్టులు ఉండనున్నాయి.
. డీఎస్సీ-2018 పెండింగ్ పోస్టులను భర్తీ చేసిన తర్వా తనే కొత్త డీఎస్సీ నిర్వహించాలని అధికారులు భావిస్తు న్నారు. న్యాయ వివాదాలతో ఎస్టీటీ-2278, పీఈటీ-340, భాషాపండితులు-248, ఆదర్శపాఠశాలల ప్రిన్సిపాళ్లు-77, బీసీ రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాళ్లు-12 పోస్టృలు భర్తీ కాలేదు. ఎలాంటి వివాదాలు లేని మ్యూజిక్ టీచర్ పోస్పలు-59 పెండింగ్లో ఉన్నాయి.
0 Response to "ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఫైల్ రడి"
Post a Comment