జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్కు తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించిన కేరళ ప్రభుత్వం వారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఆరు రోజుల చొప్పున ఐదు నెలల పాటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్య హైకోర్టుకు చేరింది.
దీనిపై వాదనలు విన్న కేరళ హైకోర్టు స్టే విధించింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు వ్యతిరేకించాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఆర్డినెన్స్ను ఆమోదించవద్దని గవర్నర్ను కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్కు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కోత కేవలం వాయిదా మాత్రమేనని..ఉద్యోగులకు వీటిని తిరిగి చెల్లిస్తామని కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇసాక్ స్పష్టం చేశారు
తిరువనంతరపురం : ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతంలో కోత విధించడానికి ఆర్డినెన్స్ జారీచేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇది వరకే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్యోగసంఘాలు పిటిషన్ దాఖలుచేశాయి. దీన్ని విచారించిన హైకోర్టు రెండునెలల స్టే విధించింది.
జీతాల కోతకు సంబంధించి అంటువ్యాధుల చట్టంలో కాని, విపత్తు నిర్వహణ చట్టంలో కానీ ఎలాంటి చట్టబద్దమైన ఆధారం లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరి జీతాల్లో ఐదు మాసాలపాటు వారి నెల జీతంలో 6రోజుల వేతనంలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ డెడక్షన్ డబ్బును ఒక నిర్దిష్ట కాల పరిమితి అనంతరం తిరిగి చెల్లిస్తామని పేర్కొంది
తాజా హైకోర్టు ప్రకటనతో ఆర్డినెన్స్ జారీ చేయడం అత్యవసరం అని భావించినట్లు వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా
దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు జీతాల్లో కోత
విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆర్డినెన్స్తో మార్గం
సుగుమమైంది. అంతేకాకుండా మంత్రులు, శాసనసభ్యుల నెలవారీ జీతంలో 30 శాతం
కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా గవర్నర్కు సిఫారసు
చేస్తామని సీఎం తెలిపారు
0 Response to "జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్"
Post a Comment