రమేష్‌కుమార్ తొలగింపుపై హైకోర్టులో విచారణ

ఏపీలో రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి  రమేష్‌కుమార్ తొలగింపుపై టీడీపీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు కూడా చేశారు. 


సోమవారం రమేష్‌కుమార్‌ తొలగింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. . 

 అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు చెప్పింది. .


రమేష్‌కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. 


విచారణలో భాగంగా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 


అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఎస్ఈసీ నియామకం అర్హతల మార్పు ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. 


నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై  నిమ్మగడ్డ రమేష్‌.  కూడా  ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.







SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రమేష్‌కుమార్ తొలగింపుపై హైకోర్టులో విచారణ"

Post a Comment